ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముంపులో లంక గ్రామాలు... ఇబ్బందుల్లో ప్రజలు

By

Published : Aug 20, 2020, 3:58 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఉద్యాన పంటలు నీటిలో మునిగిపోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

floods in konaseema at east godavari
వరద ముంపులోనే లంక గ్రామాలు... ఇబ్బందుల్లో ప్రజలు

తూర్పుగోదావరి జిల్లాలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కోనసీమ ప్రాంతంలో వరద నెమ్మదిగా తగ్గుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దిగువకు 15 లక్షలు పైబడి వరద నీటిని వదులుతున్నారు. ఈ నీరంతా కోనసీమ మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఐదు రోజులుగా కోనసీమలోని లంక గ్రామాలు వరదలోనే మునిగిపోయాయి. సుమారు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఉద్యాన పంటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. లంక గ్రామాల ప్రజలు నాటు పడవలు మీద రాకపోకలు సాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details