ఆంధ్రప్రదేశ్

andhra pradesh

bear: పొలంలో ఎలుగుబంటి... ఆందోళనలో ప్రజలు

By

Published : Jul 12, 2021, 12:24 PM IST

Updated : Jul 12, 2021, 1:53 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రోళ్ల మండలంలోని పొలాల్లో ఎలుగుబంట్లు అటుఇటూ తిరుగుతూ హల్​చల్ చేస్తున్నాయి. ఓ ఎలుగుబంటి పొలంలోని చెట్టు ఎక్కి చాలా సేపు అక్కడే ఉంది. ప్రజలు దానిని చూసి ఆందోళన చెందారు.

bear sat on the tree in m rayapuram
పొలాల్లో ఎలుగుబంటి

పొలాల్లో ఎలుగుబంటి సంచారం

అనంతపురం జిల్లా రోళ్ల మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోళ్ల మండలం ఎం.రాయపురం, జీఎన్.పాలెం, రత్నగిరి, గుడ్డగుర్కి, జీబీ.హళ్ల, వన్నారనహళ్లి, కొడగార్లగుట్ట, జీజీ.హట్టీ, టీడీ పల్లి గ్రామాల్లోని పంట పొలాల్లో ఎలుగుబంట్లు అధికంగా సంచరిస్తుంటాయి. ఎం.రాయపురం పంట పొలాల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. చెట్టు ఎక్కిన ఎలుగు చాలా సేపు అక్కడే తిష్టవేసింది. దాన్ని చూసిన రైతులు ఆందోళనకు గురై.... కేకలు వేయడంతో చెట్టు నుంచి కిందకు దిగి పొలాల మీదుగా కొండల్లోకి వెళ్లిపోయింది. ఎలుగుబంట్ల వల్ల ఏక్షణం ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి ఎలుగుబంట్ల నుంచి రక్షించాలని కోరుతున్నారు.

Last Updated : Jul 12, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details