ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే..పెద్దఎత్తున ఉద్యమిస్తాం'

By

Published : Feb 27, 2021, 6:48 PM IST

విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే.. హిందుస్థాన్‌ జింక్‌ మాదిరిగానే అవుతుందని ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోకపోతే ఉద్యోగ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే..పెద్ద ఎత్తున ఉద్యమం
విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే..పెద్ద ఎత్తున ఉద్యమం

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోకపోతే ఉద్యోగ సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే.. హిందుస్థాన్‌ జింక్‌ మాదిరిగానే అవుతుందన్నారు. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని.. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పద్ధతినే... మళ్లీ ప్రవేశపెట్టాలని కోరారు. జీపీఎఫ్‌ అడ్వాన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ సకాలంలో చెల్లించటం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details