ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident ఢీకొన్న రెండు బైకులు, గాల్లో కలిసిన మూడు ప్రాణాలు

By

Published : Aug 25, 2022, 6:29 PM IST

Three died in road accident ఒక్క రోడ్డు ప్రమాదం మూడు నిండుప్రాణాలను బలితీసుకుంది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమకు అండగా నిలుస్తారనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే.

road accident
రోడ్డు ప్రమాదం

Three died in road accident అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. చింతపల్లి మండలం మడిగుంట ఘాట్​రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్​లో నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మృతులు పాంగి మత్యరాజు, సన్నీ, గుంట జోసెఫ్​గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details