ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిడ్నాప్ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్​'తో అమలు

By

Published : Jan 17, 2021, 5:35 PM IST

సినీఫక్కీలో జరిగిన బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసుకు సంబంధించి మరో 15 మంది నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్​ చేశారు. భార్గవరామ్ ఇంట్లో... గుంటూరు శ్రీను, అఖిలప్రియ కలిసి పథకం వేసి... 20 మందితో అమలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న వారిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

Bowenpally kidnap case
15 more arrested in Bowenpally kidnap case

సీపీ అంజనీకుమార్​

తెలంగాణలోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో 15 మంది నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. పోలీసుల అదుపులో విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది ఉన్నారని వెల్లడించారు. కిడ్నాప్‌ కోసం సిద్ధార్థ... విజయవాడ నుంచి 20 మందిని పంపించాడని సీపీ వెల్లడించారు. సిద్ధార్థకు గుంటూరు శ్రీను రూ.5 లక్షలతో పాటు 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

భార్గవరామ్ ఇంట్లోనే ప్రవీణ్ సోదరుల అపహరణకు వ్యూహం పన్నారని సీపీ తెలిపారు. గుంటూరు శ్రీను, అఖిలప్రియ కలిసి ఈ నెల 2న పథకం వేసినట్లు వెల్లడించారు. ఈ నెల 4న ఎంజీహెచ్ పాఠశాలలో మరోసారి సమావేశమైనట్లు తెలిపారు. ప్రవీణ్‌ సోదరుల ఇంటి వద్ద సంపత్, చెన్నయ్యలు రెక్కీ చేసి... కిడ్నాప్​నకు పాల్పడినట్లు వివరించారు.

అపహరణకు సంబంధించి నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిపిన సీపీ... పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వివరించారు.

ఇదీ చూడండి:

కేంద్రానికి భాజపా నేతలు ఫిర్యాదు చేసుకోవచ్చు: మంత్రి వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details