ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Maoists surrendered: పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

By

Published : Aug 12, 2021, 2:00 PM IST

Updated : Aug 12, 2021, 5:32 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్న డీజీపీ..గత రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూ సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందన్నారు.

maoists
maoists

Maoists arrest: పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో అమరావతిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన ప్రకటించారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందన్నారు.

గత రెండేళ్లుగా గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని.. 19,919 కుటుంబాలకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ఆదివాసీ ప్రాంతాలకు చేరుతున్నాయని తెలిపారు. పోలీసులపై ఆదివాసీల అభిప్రాయాలు మారాయని.. హింస, రక్తపాతం ద్వారా అభివృద్ధి జరగదని వారు గుర్తించినట్లు వెల్లడించారు.

డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, మరో ముగ్గురు లొంగిపోయినట్లు స్పష్టం చేశారు. లొంగిపోయిన వారిలో చిక్కుడు చిన్నారావు, వంత వన్ను, మడకం సోమిడి, మడకం మంగ్లు, పోయం రుకిని, సోడి భీమే ఉన్నారన్నారు.

ఇదీ చదవండి:

AOB: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు అరెస్టు

Last Updated : Aug 12, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details