ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganja Seized: 566 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్​

By

Published : Nov 11, 2021, 10:12 PM IST

తెలంగాణలోని ఖమ్మం సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయి(Ganja Seized in sattupally) పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ కోటీ నలభై రెండు లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తుండగా..పోలీసులు పట్టుకున్నారు.

566 కిలోల గంజాయి పట్టివేత
566 కిలోల గంజాయి పట్టివేత

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయి(Ganja Seized in sattupally) పట్టుబడింది. ఏపీ నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. కోటీ నలభై రెండు లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి నుంచి మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​కు లారీ ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేకించి తయారు చేసిన బాక్స్​లో 566 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు భాగస్వామమై ఉండగా.. ఇందులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడని.., తప్పించుకున్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

ఖమ్మం జిల్లాలో స్పెషల్ డ్రైవ్​తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని ఎస్పీ విష్ణు వారియర్​ తెలిపారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన యోగేశ్ లింబాజీ, ఇర్ఫాన్ సదర్ అరెస్ట్​ కాగా.. గణేష్ ఉబాలే పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:

DRUGS SEIZED: భారీగా డ్రగ్స్ పట్టివేత... ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో

ABOUT THE AUTHOR

...view details