ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమస్యలు చెప్పుకుందామని వస్తే... కొవిడ్​ సిబ్బందిని తోసేశారు...

By

Published : Jan 6, 2021, 4:51 PM IST

విశాఖపట్నం జిల్లా అడారిమెట్టలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కారును అడ్డుకున్న కొవిడ్ వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

police over action on covid staff protest in adarimetta vizag district
విశాఖపట్నం జిల్లా అడారిమెట్టలో పోలీసులు అత్యుత్సాహం

కొవిడ్ కష్ట కాలంలో అత్యవసర వైద్య సేవలందిచిన తమను ఆదుకోవాలంటూ... విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం అడారిమెట్టలో వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కారును అడ్డుకుని నిరసన చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవరిస్తూ... ఈడ్చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన కొవిడ్ వైద్య సిబ్బంది... తమ పట్లు పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇలా ప్రవర్తిస్తారా అని వాపోయారు.

విశాఖపట్నం జిల్లా అడారిమెట్టలో పోలీసులు అత్యుత్సాహం

ABOUT THE AUTHOR

...view details