ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two Died by Cat Bite: పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి

By

Published : Mar 6, 2022, 8:49 AM IST

Updated : Mar 6, 2022, 7:53 PM IST

Two died by Cat Bite: వారిద్దరిని పిల్లి కరిచింది.. వైద్యుల సలహాతో టీటీ ఇంజక్షన్లు తీసుకున్నారు. ఇంకా ఏం కాదులే అనుకున్నారు. కానీ రెండు నెలల తర్వాత ఇద్దరూ ఒకేరోజు చనిపోయారు. అనంతరం వాళ్లను కరిచిన పిల్లి కూడా కుక్క చేతిలో మృతి చెందింది.

Two died by Cat Bite
పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి..కుక్కకాటుకు బలైన పిల్లి

Two died by Cat Bite: పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం వేములమడ దళితవాడలోని విశ్రాంత కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమలను, ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరు టీటీ ఇంజక్షన్లు చేయించుకొన్నారు. గాయాలు తగ్గడానికి మందులు వాడటంతో కొద్ది రోజులకు ఉపశమనం కలిగింది.

నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో, నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా, కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్‌ సోకిందని వైద్యులు చెప్పారని స్థానికులు తెలిపారు.

వారిని కరిచిన పిల్లి కుక్కకాటుకు గురై మరణించిందన్నారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము తదితరాలు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ఆరోగ్య కేంద్రం అధికారి శొంఠి శివరామకృష్ణారావు సూచించారు.

ఇదీ చదవండి :

పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి

Tidco Houses : పేదల మేడ.. గేదెలకు నీడ!

Last Updated : Mar 6, 2022, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details