ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP PEOPLE ANGRY ON GARBAGE TAX: ప్రభుత్వానిది "చెత్త" నిర్ణయం.. పన్ను రద్దుచేయాలంటున్న జనం

By

Published : Nov 27, 2021, 5:26 PM IST

Updated : Nov 27, 2021, 5:55 PM IST

నవరత్నాల పేరుతో ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. అడ్డగోలుగా పన్నులు విధిస్తూ ప్రజలపై భారం మోపుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను తరహాలో చెత్త పన్ను కూడా వేస్తున్నారని ప్రజలు (AP PEOPLE ANGRY ON GARBAGE TAX) వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతుంటే.. దానికి తోడు ఈ చెత్త పన్ను ఏంటని నిలదీస్తున్నారు.

AP PEOPLE ANGRY ON GARBAGE TAX
చెత్తపై పన్ను పట్ల ప్రజల వ్యతిరేకత



సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. పన్నుల పేరుతో ఇబ్బందులు పెడుతోందని ప్రజలు (AP PEOPLE ANGRY ON GARBAGE TAX) విమర్శిస్తున్నారు. పురపాలక చట్టంలో మార్పు చేసిన ప్రభుత్వం.. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచింది. వీటితో పాటు చెత్తపై కూడా పన్ను కట్టాలని స్పష్టం చేసింది. రోజూ కూలీలు, సామాన్యులకు ఈ పన్నులు భారమవుతున్నాయి.

చెత్తపై పన్ను పట్ల ప్రజల వ్యతిరేకత

కొవిడ్‌ తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో చెత్తపై పన్ను వేయడం ప్రజలకు మరింత భారంగా మారింది. ఉచిత పథకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి.. ఇప్పుడు పన్నుల పేరుతో దిద్దుబాటు చర్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.

ప్రతీ ఇంటి నుంచి నెలకు రూ.30, హోటళ్ల నుంచి రూ.120 చెత్త పన్ను చెల్లించాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. కనీసం మురుగు కాలువలు కూడా సరిగా శుభ్రం చేయకుండా.. పన్నులు వసూలు చేయడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. పెంచిన పన్నులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Central government team in Tirupati: తిరుపతికి కేంద్ర బృందం.. వరద నష్టం వివరాల సేకరణ

Last Updated : Nov 27, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details