ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వినాయక చవితికి ఆటంకాలు కలిగించొద్దు'

By

Published : Aug 17, 2020, 1:50 PM IST

వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించొద్దని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి కోరారు. ప్రజలు సామూహికంగా జరుపుకొనే చిన్నచిన్న పండుగల విషయంలో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

BJP state vice-president and Nehru Yuva Kendra national vice-chairman Vishnuvardhan Reddy
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి

వినాయక చవితి.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి అన్నారు. పండుగలను, ప్రజలను ప్రభుత్వం మత, ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని హితవు పలికారు. వినాయక చవితి మతాలకు సంబంధించిన అంశం కాదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని మతం కోణంలో చూస్తున్నట్లుందని, ఈ విషయంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం హిందుమత పెద్దలు, స్వామీజీలు, మఠాధిపతులతో చర్చించాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details