ఆంధ్రప్రదేశ్

andhra pradesh

10th Results: 'పది' ఫలితాలు విడుదల..సబ్జెక్టులు, ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు

By

Published : Aug 6, 2021, 5:47 PM IST

Updated : Aug 6, 2021, 8:36 PM IST

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేశారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామన్నారు.

ssc results
ssc results

'పది' ఫలితాలు విడుదల

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి సబ్జెక్టుల వారీగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామన్నారు.

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్ల వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్‌ఏకు 50 శాతం, ఎస్‌ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేశామన్నారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు.

ప్రతిభావంతులకు నష్టం

కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి సురేశ్ అన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరటంతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించించి గ్రేడ్లు ఇచ్చిందన్నారు.

ఇదీ చదవండి

ap cabinet meet: కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే..

Last Updated : Aug 6, 2021, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details