ఆంధ్రప్రదేశ్

andhra pradesh

FLOOD RELIEF MEASURES: వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు.. ప్రభుత్వం నిర్ణయం

By

Published : Nov 21, 2021, 7:19 PM IST

Updated : Nov 21, 2021, 7:50 PM IST

FLOOD RELIEF MEASURES
FLOOD RELIEF MEASURES

19:14 November 21

GROCERIES DISTRIBUTION TO FLOOD AFFECTED FAMILIES

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలను(FREE GROCERIES TO PEOPLE) అందించాలని నిర్ణయించింది. భారీ వరదలతో ప్రభావితమైన నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని బాధితులకు సరకులు అందించాలని నిర్ణయం తీసుకుంది.

ఒక్కో బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు వంటనూనె, కేజీ ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు చొప్పున అందించాలని ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సప్లయ్ శాఖ ద్వారా ఉచితంగా సరకులు పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా కలెక్టర్లు పంపిణీ పక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: 

Floods in AP: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు - సీఎం జగన్

Last Updated :Nov 21, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details