ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే

By

Published : Jan 30, 2022, 9:18 AM IST

Rathasapthami at Tirumala : తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారిగా ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Ratha Sapthami at Tirumala
తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు

Rathasapthami at Tirumala : తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారిగా ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ రథసప్తమి రోజున జరిగే ఏడు ప్రధాన వాహన సేవలను శ్రీవారి అంతరాలయంలోని కల్యాణమండపం, రంగనాయకుల మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలోనే తితిదే అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించనున్నట్లు సమాచారం. దర్శన టికెట్లు ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తారు. వారికి కూడా ఆలయంలో ఏకాంతంగా జరిగే వాహనసేవలను దర్శించే భాగ్యం ఉండదు.

ABOUT THE AUTHOR

...view details