ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాధారణ బదిలీల గడువు తేదీని పొడగించిన ప్రభుత్వం

By

Published : Jun 17, 2022, 3:11 PM IST

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాలు, వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 తేదీ నుంచి తిరిగి ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం
ప్రభుత్వం

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల గడువు నేటితో ముగియనుండటంతో ….దీన్ని పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలు, జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు బదిలీల గడువును పెంచుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ జారీ చేసింది. ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తికాకపోవటంతో సీఎం కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఆర్డర్ టూ సర్వ్ ప్రాతిపదికన తాత్కాలిక కేటాయింపులు జరిగిన చోట కూడా కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా , జోనల్ , మల్టీ జోనల్ కేడర్​లను యూనిట్ల వారీగానే బదిలీకి పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే చోట 9 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోని ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లను బదిలీ చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీలకు కటాఫ్ తేదీని కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2022 జూన్ 7 తేదీ నాటికి ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీలకి అర్హులని స్పష్టం చేసింది. జూన్ 30 తేదీ వరకూ బదిలపై నిషేధం సడలింపు ఉంటుందని.. జూలై 1 తేదీ నుంచి తిరిగి నిషేధం అమలు కానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details