ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: పెసరకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

By

Published : Sep 2, 2020, 8:33 AM IST

Updated : Sep 2, 2020, 10:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ గ్రామీణ జిల్లా దామరమండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

road-accident-at-pasaragonda-in-warangal-district-five-members-died
పెసరకొండ వద్ద రోడ్డు ప్రమాదం

పెసరకొండ వద్ద రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా దామర మండలం పెసరకొండ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్​కు చెందిన ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న లారీ, కారును వేగంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.

కాళేశ్వరం నుంచి వరంగల్ వైపుగా వస్తున్న ఇసుక లారీ వరంగల్ నుంచి పరకాల వైపు వెళ్తున్న ఢీ కొట్టింది. వరంగల్​లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై... పరకాల వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో మేడి పవన్ కుమార్, మేకల రాకేష్, మేడి చందు, రోహిత్, సాబీర్​గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

Last Updated : Sep 2, 2020, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details