తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి చెరువులో లింగాపూర్కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలోనే ఓ మత్స్యకారుని వలలో బంగారు వర్ణంలో ఉన్న చేప చిక్కింది. దీని బరువు సుమారు 5 కిలోల వరకు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.
తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్న ఓ 5 కిలోల చేప వలలో పడింది. అరుదుగా కనిపించే అందమైన చేపను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.
![తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10046447-127-10046447-1609235171205.jpg)
తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప
చేప పూర్తిగా బంగారు వర్ణంలో ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్ అలీ