ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"కోడిగుడ్లు, చిక్కీలను తనిఖీ చేసేందుకు...కమిటీలు ఏర్పాటు చేయండి"

By

Published : Apr 23, 2022, 8:52 AM IST

Committees: మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్లు, చిక్కీలను తనిఖీ చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని డైరెక్టర్‌ దివాన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు కమిటీలను ఏర్పాటు చేయని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

Committee
కోడిగుడ్లు, చిక్కీలను తనిఖీ చేసేందుకు కమిటీలు

Committees: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్లు, చిక్కీలను తనిఖీ చేసేందుకు మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని డైరెక్టర్‌ దివాన్‌ ఆదేశాలు జారీ చేశారు. చిక్కీల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం, నాణ్యత పరిశీలనకు మండల విద్యాధికారితో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను నియమించాలని సూచించారు. ఇప్పటివరకు కమిటీలను ఏర్పాటు చేయని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. బిల్లుల చెల్లింపునకు ముందు కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: రేషన్‌ బియ్యానికి బదులు నగదు...నూరుశాతం వ్యతిరేకిస్తున్న కార్డుదారులు

ABOUT THE AUTHOR

...view details