ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBI: జగన్‌ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ

By

Published : Aug 13, 2021, 4:37 PM IST

Updated : Aug 13, 2021, 5:17 PM IST

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

16:30 August 13

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

జగన్​ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది.పెన్నా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామని జగన్, విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఈ కారణంగా.. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా వేసిన న్యాయస్థానం.. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

Letter: 'మా కుటుంబానికి భద్రత కల్పించండి'.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

Last Updated : Aug 13, 2021, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details