ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN ON FLOODS: 'పార్టీ శ్రేణులంతా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి'

By

Published : Nov 21, 2021, 11:44 AM IST

Updated : Nov 21, 2021, 2:31 PM IST

ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు(CHANDRABABU RESPONDS ON FLOODS) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

chandrababu-responds-on-ap-floods
'పార్టీ శ్రేణులంతా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి'

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు(CHANDRABABU RESPONDS ON AP FLOODS) పిలుపునిచ్చారు. సహాయచర్యలకు సమన్వయకర్తలుగా తెదేపా సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లను సమన్వయకర్తలుగా నియమించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.

Last Updated : Nov 21, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details