ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగ్గయ్యపేటలో చెలరేగిపోయిన వైఎస్సార్సీపీ మూకలు- టీడీపీ నేతల ఇళ్లు, వాహనాలపై దాడులు - ysrcp leaders attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 8:19 PM IST

ysrcp_attack (ETV Bharat)

YSRCP Attack TDP Leaders in NTR District : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీ సర్పంచి ఇంటిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో పోలింగ్ బూత్ లో నెలకొన్న చిన్న వివాదం టీడీపీ కార్యకర్తలపై దాడికి దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు స్థానిక సర్పంచి లక్ష్మణరావు ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.


వైఎస్సార్సీపీ దాడిలో కొంత మంది కార్యకర్తలు, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న స్థానిక సీఐ జానకిరామ్​తో పాటు ఆయన సిబ్బంది సైతం తెలుగుదేశం నాయకుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారని సర్పంచి లక్ష్మణరావు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఒకసారి దాడి చేస్తే పోలీసులు మరోసారి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details