ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిజాంపట్నంలో రెచ్చిపోయిన ఎంపీ అనుచరులు- టీడీపీ ప్రచారం అడ్డగింత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 1:24 PM IST

tdp_leader

YCP MP Mopidevi Followers Blocked the Campaign of TDP Leaders : బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్​సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరులు బీభత్సం సృష్టించారు. నిజాంపట్నంలో తెలుగుదేశం నేతలు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకొని టీడీపీ శ్రేణులపై దాడికి యత్నించారు. నిజాంపట్నంలో విపక్షాలు ఎలాంటి ప్రచారం చేయకూడదని, వెనక్కి వెళ్ళిపోవాలని అమానుషంగా ప్రవర్తించారు.

'బాబు ఘ్యారిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్నినిజాంపట్నం పంచాయతీలో గురువారం నుంచి నిర్వహించే విధంగా టీడీపీ నేతలు ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల కేంద్రం నిజాంపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు శ్రీకారం చుట్టారు. గ్రామ దేవత మొగదారమ్మ ఆలయం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా, ఎంపీ మోపిదేవి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం వాతావరణం నెలకొంది. ఎంపీ అనుచరులు మద్యం మత్తులో తమ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. తర్వాత కార్యక్రమాన్ని టీడీపీ వర్గీయులు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details