ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీ-విజిల్​​లో ఫిర్యాదు - వ్యక్తిపై వైసీపీ నేత దాడి - YCP Attack C Vigil Complaint Person

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 2:02 PM IST

YCP Leader Attack C- Vigil Complaint Person

YCP Leader Attack C- Vigil Complaint Person: ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సీ- విజిల్ యాప్​లో ఫిర్యాదు చేశారంటూ ఓ వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. వైసీపీ కార్యాలయానికి ఉన్న రంగులు తొలగించలేదంటూ వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన నాగుల్‌ బాషా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగులు తొలగించకుండా అలాగే ఉండటంతో ఫొటో తీసి వాటిని సీ- యాప్‌లో పోస్టు చేసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వైసీపీ నేత పోలా పూర్ణ ఆగ్రహనికి గురైనట్లు బాషా తెలిపాడు. అతడితోపాటు మరి కొందరు కలిసి తనపై దాడి చేశారని నాగుల్‌ బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. 

పూర్ణ తనపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాషా అన్నాడు. తనను చంపేస్తామని బెదిరించారని బాధితుడు వాపోయాడు. గాయాలతో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగుల్ బాషా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. 

ABOUT THE AUTHOR

...view details