ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సత్యసాయి జిల్లాలో నీటి ఎద్దడి- ధర్నాతో రోడెక్కిన మహిళలు - water problem in satyasai

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 6:14 PM IST

Women_Protest_With_Empty_Bins_at_Rekkamanu

Women Protest With Empty Bins at Rekkamanu : తాగునీటి సమస్య పరిష్కారంలో పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు, గాండ్లపెంట మండలాల్లో నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. తనకల్లు మండలం కొట్టువారిపల్లెలో వారం రోజులుగా నీటి సమస్య ఉందని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 

People Facing Water Crisis For A Week : మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలియజేశారు. గాండ్లపెంట మండలం రెక్కమానులో తాగునీటి ఎద్దడిని వారం రోజులుగా ఎదుర్కొంటున్నామని, దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదంటూ కదిరి, రాయచోటి ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. సచివాలయ సిబ్బందికి తాగునీటి సమస్యను విన్నవించిన పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై కృష్ణవేణి మహిళలకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.

ABOUT THE AUTHOR

...view details