ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్​కు భయపడి తల్లి విజయమ్మ అమెరికా వెళ్లారు- నారా లోకేశ్ - Nara Lokesh in Rachabanda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 10:02 PM IST

Nara_Lokesh_participated_in_Rachabanda_program_in_Guntur_District

Nara Lokesh participated in Rachabanda program in Guntur District : ఎన్నికల సమయంలో శవ రాజకీయాలు చేయడం జగన్​ మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని నారా లోకేశ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో సానుభూతి ఓట్లు రాబట్టడం కోసం జగన్ కోడి కత్తి పేరుతో డ్రామాలు ఆడారని విమర్శించారు. అది పెద్దగా ఫలించకపోవడంతో సొంత బాబాయిని హత్య చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో గులకరాయి పేరుతో మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నింటిని గమనించి ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 

ఈ ఎన్నికల్లో జగన్​కు భయపడి తల్లి విజయమ్మ ఆయన ఇంటికి పోకుండా అమెరికా వెళ్లిపోయారని తెలిపారు. చెల్లి షర్మిల ప్రచారం పేరుతో రోడ్లపైనే తిరుగుతున్నారని విమర్శించారు. రాజధానిలో పేదలకు ఇస్తున్న 5వేల రూపాయల పింఛన్‌ను కొనసాగిస్తామన్నారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డితో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details