ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేలా యువ న్యాయవాదులు అడుగులు వేయాలి : జస్టిస్ అసనుద్దీన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 10:43 PM IST

justice_asanuddin

Justice Asanuddin Amanullah Comments : న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచే విధంగా యువ న్యాయవాదులు భవిష్యత్‌లో అడుగులు వేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో యువ న్యాయవాదన సదస్సు నిర్వహించారు. అనంతపురం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌నకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్  అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్. వి. ఎన్ భట్టి హాజరయ్యారు. యువ న్యాయవాదులకు వృత్తిలో ఎదుర్యయే సవాళ్ల గురించి పలు సూచనలు చేశారు. న్యాయవాదులు మొదటి ప్రాధాన్యత క్లయింట్​కే ఇవ్వాలని ఆయన సూచించారు. 

జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా గతంలో ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. హైకోర్టులో పనిచేసిన సమయంలో ఆయన పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. పాలనపరమైన వ్యవహారాల్లో సైతం సహాయ సహకారాలు అందించారు. ఏపీ హైకోర్టు నుంచి ఆయన పట్నా హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details