ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: సర్వేపల్లిలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగసభ - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU PRAJAGALAM MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 4:37 PM IST

Updated : Apr 20, 2024, 5:20 PM IST

CHANDRABABU PRAJAGALAM MEETING: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. నేడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటమి ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో ప్రజాగళం - వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు - పవన్‌ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు - పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు బహిరంగసభలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated :Apr 20, 2024, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details