ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు - పది మంది మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 7:46 AM IST

Updated : Feb 26, 2024, 2:04 PM IST

Several Road accidents in AP: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. లారీ టైరు పంచర్​ కావడంతో రోడ్డు పక్కన నిలిపి పంచర్​ వేస్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 40మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూరు జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

road_accidents_in_ap
road_accidents_in_ap

Several Road accidents in AP : రాష్ట్రంలో సోమవారం జరిగిన పలు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, కర్ణాటకలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రాష్ట్ర వాసులు ప్రాణాలు కోల్పోయారు.

Kakinada Prathipadu Road Accident: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వెనక టైర్​ పంచర్ వేస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి విశాఖకు ఓ లారి బయల్దేరింది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు సమీపంలోకి రాగానే వెనక టైర్​ పంచరైంది.

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి

గమనించిన డ్రైవర్​ లారీని ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన నిలిపివేశాడు. టైరుకు పంక్చర్‌ వేస్తుండగా, ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పంచర్​ వేస్తున్న వ్యక్తులతో పాటు స్థానికుడు ఒకర్ని ఢీ కొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గమనించిన ఆర్టీసీ బస్​ డ్రైవర్​ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో, ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారిలో ముగ్గురు బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెం గ్రామానికి చెందిన వారైన దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, క్లినర్ నాగయ్య కాగా, స్థానికుడు రాజు అని పోలీసులు వెల్లడించారు.

టైరు పేలి బొలెరో వాహనం బోల్తా - 17 మంది కూలీలకు గాయాలు

కూలీల బొలెరో బోల్తా: అనంతపురం జిల్లాలో 40మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడింది. దీంతో 40మందికి గాయాలు కాగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వారిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వజ్రకరూరు నుంచి పాల్తూరుకు మిర్చి తోటలో పనిచేయడానికి కూలీలు బొలెరో వాహనంలో బయల్దేరారు. వీరు ఉరవకొండ సమీపానికి చేరుకోగానే వీరి వాహనం వెనక టైరు పేలి వాహనం అదుపు తప్పి బొల్తా పడింది.

ఆదుకోని అంబులెన్స్​: ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్​కు సమాచారం అందించిన 108 వాహనం రాలేదని రోడ్డు ప్రమాద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 108 వాహనం కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో, స్థానికులే వీరిని ప్రైవేటు వాహనాల ద్వారా ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగుర్ని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం - కర్నూలు వాసులు 3మృతి :కర్ణాటక రాష్ట్రంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్నూలు జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని దావణగెరి వద్ద టెంపో వాహనం టైర్‌ పంక్చరై అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న ప్రాణాలు కోల్పోగా, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్న మృతి చెందాడు.

మరణించిన వారు మిర్చి రైతులు కాగా, వారు జిల్లా నుంచి మిర్చిని కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌లో విక్రయించాడానికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో టెంపో వాహనంలో మిర్చి లోడ్​ వేసుకుని, బ్యాడిగి మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

తుని హైవేపై బస్సు-లారీ ఢీ - సీసీ టీవీలో దృశ్యాలు

అన్నమయ్య జిల్లాలో ముగ్గురు మృతి: అన్నమయ్య జిల్లా రామపురం మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన కృష్ణ బాబు, భవాని, హినిత ద్విచక్ర వాహనంపై రాయచోటికి బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో వారు గన్సాయి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని వీరి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.

ప్రమాద స్థలంలోనే కృష్ణ బాబు, భవానిలు ప్రాణాలు కోల్పోగా, హినితను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బైక్​ను తప్పించబోయి కంటైనర్​కు ఢీ కొట్టిన కారు- 9మంది దుర్మరణం

Last Updated : Feb 26, 2024, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details