ETV Bharat / state

'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

author img

By

Published : Jan 18, 2020, 8:41 AM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​ ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

nandamuri family pays tribute to senior N. T. Rama Rao
'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్​ 24వ వర్ధంతి పురస్కరించుకుని హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ఘాట్​లో నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది.

జూనియర్​ ఎన్టీఆర్, కల్యాణ్​ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్​కు నివాళి అర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు ఉంటారని, ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతి తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారని జూనియర్​ ఎన్టీఆర్​ వ్యాఖ్యానించారు.

తమ అభిమాన నటుడు, రాజకీయవేత్తను గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో నందమూరి ​ అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్​ ఘాట్​ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

TG_HYD_13_18_NTR_VARDHANTHI_AV_TS10008 note: ఫీడ్ 3G నుంచి వచ్చింది. ( )ఎన్టీఆర్ 24 వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి పురధేశ్వరి ఆమె కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తె దే పా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.