LIVE గుంటూరులో APCC చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర- ప్రత్యక్షప్రసారం - Sharmila Nyaya Yatra Public Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:19 PM IST

Updated : Apr 25, 2024, 8:55 PM IST

thumbnail

YS Sharmila Nyaya Yatra Public Meeting in Satthenapally LIVE : APCC చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా సీఎం జగన్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులులు, సింహాలు అని చెప్పుకునే జగన్, బీజేపీని చూసి పిల్లిలా అయ్యారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి మడకశిర నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ హామీని మరిచారని విమర్శించారు. అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఇక లెదర్ పార్కు హామీని సైతం మరిచారని షర్మిల మండిపడ్డారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన జగన్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్కటైనా సాధించారా అంటు జగన్​పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం  గుంటూరులో వైఎస్‌ షర్మిల ఏపీ న్యాయ యాత్ర బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 25, 2024, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.