LIVE: మీడియాతో ముకేశ్‌కుమార్‌ మీనా ప్రత్యక్ష ప్రసారం - CEO Mukesh Kumar Meena Press Meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 4:21 PM IST

Updated : May 11, 2024, 5:07 PM IST

thumbnail

CEO Mukesh Kumar Meena Press Meet : ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. పోలింగ్‌, భద్రతా ఏర్పాట్లపై సీఈవో ముకేష్‌కుమార్‌ మీనా సమీక్ష ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. డ్రైడే కాలాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఈవో సూచించారు. ఉచితాలు, నగదు పంపిణీపై దృష్టి పెట్టాలని పునపుద్ఘాటించారు. సాయంత్రం 6 గం.కు ప్రచార కార్యక్రమాలు ముగుస్తాయని, పోలింగ్‌కు 48 గంటల ముందునుంచే సైలెన్స్‌ పీరియడ్‌ అమలు అవుతుందని గుర్తు చేశారు.సైలెన్స్‌ పీరియడ్‌ కాలంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి లౌడ్‌ స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సాయంత్రం 6 తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదని, రాజకీయ ప్రభావం ఉండే సంక్షిప్త సందేశాలపైనా నిషేధంల తప్పనిసరి అని పేర్కొన్నారు. పార్టీల రాష్ట్ర ఇన్‌ఛార్జులు, ఆఫీసు బేరర్లు పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని తెలిపారు. మీడియా సమావేశం ముకేశ్‌కుమార్‌ మీనా ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : May 11, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.