LIVE :వెంకటగిరిలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ- ప్రత్యక్ష ప్రసారం - Nandamuri Balakrishna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 5:54 PM IST

Updated : Apr 27, 2024, 6:32 PM IST

thumbnail

Nandamuri Balakrishna Swarnandhra Sakara Yatra Live at Venkatagiri : ఎన్నికల సమీపిస్తున్న వేళ నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు. తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చి స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సంఘీభావం తెలిపుతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు బాలకృష్ణ వివరిస్తూ కేంద్ర సహకారం కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ముస్లింలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ఎప్పుడు చూడలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ వర్గాల వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : Apr 27, 2024, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.