LIVE: ఆత్మకూరులో చంద్రబాబు ప్రజాగళం సభ - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 5:19 PM IST

Updated : Apr 27, 2024, 6:12 PM IST

thumbnail

Chandrababu Prajagalam: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం భహిరంగ సభలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ మెనిపెస్టోకు తెలుగుదేశం మెనిపెస్టోకు పోలిక లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చారు. బాబాయ్‌ను గొడ్డలితో నరికించిన జగన్‌ని మాత్రం భుజాలపై వేసుకుంటారని అన్నారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై అన్యాయంగా కేసు పెట్టారని అన్నారు. అంతమంది సమూహంలో గులకరాయి వేసిన నిందితుడిని పట్టుకున్నారు.  మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు మద్యపాన నిషేధం చేసి ఉండేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. మద్యాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతావని నిలదీశారు.  

Last Updated : Apr 27, 2024, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.