LIVE: రాజంపేటలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ ప్రత్యక్షప్రసారం - Chandrababu and Pawan Kalyan live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:41 PM IST

Updated : Apr 25, 2024, 5:37 PM IST

thumbnail

Chandrababu and Pawan Kalyan Rajampeta Public Meeting Live:రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్డీఏ నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం విజయనగరం జిల్లాలో ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. బహిరంగ సభల్లో వారాహి వాహనం పైనుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం కూడా జగన్ ను ఓడించి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగసభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : Apr 25, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.