ETV Bharat / politics

అక్కడ ₹8 వేలకే ఐఫోన్ ! - భారీ రాకెట్​ను ఛేదించిన పోలీసులు - stolen Cell phones

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 3:37 PM IST

cell_phone_theft
cell_phone_theft

Mobile Phones Theft Sudan Gang Arrested in Hyderabad : హైదరాబాద్​లో సెల్​ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ఇంటర్నేషనల్​ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Mobile Phones Theft Gang Arrested In Hyderabad : హైదరాబాద్​లో సెల్​ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ఇంటర్నేషనల్​ ముఠాను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లో సుడాన్​ దేశస్థులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా మారి నిరుద్యోగులను అసరాగా చేసుకుని చోరీలకు తెరదీశారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఈ ముఠా రాత్రిళ్లు రోడ్లపై వెళ్లేవారిని టార్గెట్​గా చేసుకుని సెల్​ఫోన్​లు చోరీ చేస్తున్నారు. నైట్​ టైమ్​​లో రోడ్లపై వెళ్లేవారితో బస్సు వస్తుందా? టైం ఎంత? అని అడిగి వారితో మాటలు కలిపి వాళ్లకు తెలియకుండా సెల్​ఫోన్ లాక్కొని పోతున్నారు. అయితే సెల్​ఫోన్ పోయిందంటూ ఒకరిద్దరు తమ వద్దకు వస్తే నార్మల్ థెప్ట్ కేసని భావించిన పోలీసులు, చోరీ అవుతున్న ప్యాటర్న్​ను గమనించారు. ఆ తర్వాత వరుసగా వందల కేసులు రావడంతో దీని వెనక పెద్ద ముఠా ఉందని గ్రహించారు. అలా వీరిపై నిఘా పెట్టి తాజాగా ఈ ముఠాను అరెస్టు చేశారు.

అక్కడ ₹8వేలకే ఐఫోన్- భారీ రాకెట్​ను ఛేదించిన పోలీసులు

పట్టపగలే 66 లక్షలు చోరీ కేసు - బెయిల్​పై వచ్చి నిందితుడు ఆత్మహత్య - Accused Committed Suicide

"చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్‌ఫోన్లను జగదీష్​ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దెబ్బతిన్న సెల్‌ఫోన్లను జగదీష్ మార్కెట్‌లో డిస్మెంటల్‌ చేస్తున్నారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీష్ మార్కెట్‌లో కౌంటర్‌ పెట్టాడు. ఐఫోన్లను సైతం రూ.8 వేల నుంచి అమ్ముతున్నారు. సెల్‌ఫోన్లు సముద్ర మార్గం ద్వారా సూడాన్‌ తరలిస్తున్నారు. విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువ ఉంటుందని పడవల్లో తరలిస్తున్నారు. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్​ను విడివిడి భాగాలను కూడా అమ్ముతున్నట్లు విచారణలో గుర్తించాం." - కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ

అమ్మవారికి అలంకరించిన 30 తులాల బంగారం 100 తులాల వెండి 40 లక్షల నగదు చోరీ - Robbery in Sri Chakrapuram Temple

Mobile Stealing Gang In Hyderabad : 12 మంది హైదరాబాద్ వాసులు, ఐదుగురు సుడాన్​కు చెందిన వారు ముఠాగా ఏర్పడి, ఇలా రాత్రిళ్లు చోరీలకు పాల్పడి వచ్చిన సెల్​ఫోన్లను సుడాన్​ సహా ఇతర దేశాలకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. అపహరణకు గురైన కొన్ని జగదీష్​ మార్కెట్​ అడ్డాగా చేసుకుని విక్రయిస్తున్నారని వెల్లడించారు. చోరీ చేసిన వాటిలో దెబ్బతిన్న ఫోన్లను​ డిస్మెంటల్​ చేస్తున్నారని చెప్పారు.

అపహరించిన ఫోన్లను విక్రయించడానికి ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీష్​ మార్కెట్​లో కౌంటర్​ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఐఫోన్లను రూ.8వేలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇతర ఫోన్లను జమ చేసి డేటా అంతా క్లియర్​ చేసి వాటన్నింటి మళ్లీ ఇతర దేశాలలకు తరలిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో నిఘా ఎక్కువ ఉంటుందన్న కారణంతో వాటిని సముద్ర మార్గాన తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్​ మీ కోసమే! - How To Protect Wifi From Hackers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.