ETV Bharat / politics

నేను రాజీనామా పత్రంతో వచ్చా - రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు - HARISH RAO VS CM REVANTH REDDY

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 2:43 PM IST

Harish Rao VS Revanth Reddy
Harish Rao VS Revanth Reddy

Harish Rao CM Revanth Reddy Challenge: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్‌ వద్దకు వచ్చానని ఆ రాష్ట్ర మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే, రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని అన్నారు.

నేను రాజీనామా పత్రంతో వచ్చా - రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు

Harish Rao VS Revanth Reddy : తెలంగాణలోని మెదక్‌లో ఆ రాష్ట్ర మాజీమంత్రి మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై సీఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు.

మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు రేవంత్‌ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పీఏ, సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

Harish Rao Accept Revanth Challenge : ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని, ఒకవేళ హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని హరీశ్‌రావు చెప్పారు. చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్‌ ఇవ్వాలని తెలిపారు. అలాగే తాను ఉపఎన్నికలో కూడా పోటీ చేయనని స్పష్టంగా చెప్పానని హరీశ్‌రావు అన్నారు.

Harish Rao Fires on Congress Guarantees : వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు బాధ్యత తనదంటూ సోనియా లేఖ రాశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు హామీలు, రుణమాఫీపై ముఖ్యమంత్రి తొలి సంతకం పెడతామన్నారని, మాట తప్పిన ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే ముఖ్యమని పేర్కొన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు ఆ లేఖను జర్నలిస్టుల చేతిలో పెట్టి వెళ్తున్నట్లు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను చర్లపల్లి జైల్లో పెడతా - రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ - Revanth Reddy Speech in Tukkuguda

"రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఏ రోజు కూడా అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించలేదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే ప్రధాన ప్రతిపక్షంగా మా కర్తవ్యం. రాజకీయాల కంటే పేద ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం. అవ్వ, తాతలకు రూ.4,000లు పింఛన్‌ ఇవ్వాలి. రైతులకు రూ.15,000లు రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ అందించాలి.వరి, మక్కలకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి. మహిళలకు రూ.2500 ఇవ్వాలి." - హరీశ్‌రావు, తెలంగాణ బీఆర్ఎస్‌ నేత

'కేసీఆర్‌ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి - ఆయన నాటిన గంజాయి మొక్కలు వాసన వెదజల్లుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.