Live: పామర్రులో వైఎస్ షర్మిల న్యాయయాత్ర బహిరంగసభ - ప్రత్యక్షప్రసారం - YS Sharmila Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 5:29 PM IST

Updated : Apr 24, 2024, 6:10 PM IST

thumbnail

YS Sharmila Nyay Yatra Public Meeting in Pamarru Live: కృష్ణా జిల్లాలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర కొనసాగుతోంది. తన అఫిడవిట్​లో పేర్కొన్న అప్పుల అంశంపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో న్యాయం కోసం పోరాడుతున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమౌంతుందోనన్న ఆందోళనను షర్మిల వ్యక్తం చేశారు.అప్పులపై అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు. మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని షర్మిల పేర్కొన్నారు. కొందరు చెల్లికివ్వాల్సిన వాటాను కూడా తమదిగా భావిస్తారని విమర్శించారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి ఆస్తులు పంచారనేది కుటుంబం మొత్తానికి, దేవుడికీ తెలుసని షర్మిల వెల్లడించారు. తమ పోరాటం ఆస్తుల కోసం కాదు, న్యాయం కోసమని షర్మిల స్పష్టం చేశారు. రేపు మాకు, మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, న్యాయం మొండిగా కోసం పోరాటం చేస్తున్నామని షర్మిల వెల్లడించారు. కృష్ణా జిల్లా పామర్రులో వైయస్ షర్మిల బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం.

Last Updated : Apr 24, 2024, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.