LIVE రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరీ సభ ప్రత్యక్షప్రసారం - pavan Kalyan Varahii live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 6:32 PM IST

Updated : Apr 26, 2024, 7:10 PM IST

thumbnail

pavan Kalyan Varahi Vijaya Bheri Sabha At malikipuram Live: 2024 ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పవన్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ దోపిడిపై విచారణ చేపడతామని పవన్ హామీ ఇచ్చారు. రాయి దాడి విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్​ను భయపెట్టే విధంగా భారీ మెజారిటీని ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు.  మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు. ప్రస్తుతం వారాహి విజయ భేరీ సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్ ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 26, 2024, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.