ఓటు వేసేందుకు షార్జా నుంచి ఏపీ చేరుకున్న 100 మంది ప్రవాసాంధ్రులు - NRIs From Sharjah to Cast Vote

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 4:39 PM IST

thumbnail
ఓటు వేసేందుకు షార్జా నుంచి ఏపీ చేరుకున్న 100 మంది ప్రవాసాంధ్రులు (ETV Bharat)

NRI'S Came From Sharjah to Cast Vote Andhra Pradesh : ఓటు వేసేందుకు 100 మంది ప్రవాసాంధ్రులు షార్జా నుంచి  ఏపీకి వచ్చారు. పలు దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎయిర్​పోర్టు అధికారులు కోవిడ్ పరీక్షలు చేశారు. ఆంధ్రాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్​ చూసి తమ వంతు సాయం చేసి మార్పు తీసుకురావాలని వచ్చామని ప్రవాసాంధ్రులు తెలిపారు. 
15 సంవత్సరాల తర్వాత ఓటు వేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తమకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేయటం గర్వంగా ఉందని తెలిపారు. బాధ్యతగా ఓటు వేయటం మన హక్కు అని పేర్నొన్నారు. ఓటు వేసి మరుసటి రోజు దుబాయ్ వెళ్లిపోతామన కొందరు, ఐటీ ఉద్యోగానికి సెలవు పెట్టి ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చామని కొందరు తెలిపారు. ఓటు వేసి ఆంధ్రాని అభివృద్ధి చేయాలని వచ్చామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.