ఎన్నికల వేళ వైసీపీ కుట్రలు బట్టబయలు - ఓటర్లకు పంచనున్న చీరలు పట్టివేత - EC SEIZED YSRCP GIFTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 11:02 AM IST

thumbnail

EC SEIZED YSRCP GIFT Sarees: ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నాయి. రేణిగుంటలో వందల కోట్ల రూపాయల విలువచేసే తాయిలాలు పట్టుబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా తాజాగా వైసీపీ నేతలు ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న తాయిలాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని గిడ్డంగిలో పెద్ద ఎత్తున చీరలను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 18 బండెల్స్​లో ఉన్న 1,800 చీరలను సీజ్ చేశారు. 

చీరల పెట్టెల మీద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. చీరలతో పాటు వైసీపీ చిహ్నాలతో ముద్రించి ఉన్న మరికొన్ని సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చీరల విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నారు. గిడ్డంగిలోని చీరలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఈ చీరలు భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.