భర్తకు గుండెపోటు.. నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణం పోసిన భార్య!

By

Published : Oct 1, 2022, 8:47 PM IST

thumbnail

గుండెపోటు వచ్చిన తన భర్తకు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాలు కాపాడింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర రైల్వేస్టేషన్‌లో జరిగింది. కోజీకోడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అతడిని రైలులో నుంచి కిందకి దించి ప్లాట్​ఫామ్​పై సీపీఆర్‌ చేశారు. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురువతూనే భర్త ప్రాణాలకు అండగా నిలిచింది. తన నోటి ద్వారా భర్తకు పది నిమిషాలు శ్వాసను అందించింది. ఆమెకు రైల్వే పోలీసులూ తోడయ్యారు. కాళ్లు, చేతులు నలుస్తూ సపర్యలు చేశారు. ఆ వ్యక్తికి స్పృహ రాగానే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.