వీర జవానుకు వేణు గానంతో కుమార్తె నివాళి

By

Published : Aug 16, 2022, 12:05 PM IST

thumbnail

దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. కర్ణాటకలోని చామరాజనగర్​ జిల్లాకు చెందిన హనీ అనే ఓ బాలిక తన తండ్రి సమాధి ముందు వేణువు మీద జాతీయ గీతం వాయిస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. జిల్లాలోని గౌడహళ్లి గ్రామానికి చెందిన విశ్రాంత సైనికుడైన నవీన్​ ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబం ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రత్యేకంగా నివాళులర్పిస్తోంది. సోమవారం నవీన్ సమాధి ముందు హనీ వేణువు మీద జాతీయ గేయాన్ని ఆలపిస్తూ అంజలి ఘటించింది. ఈ కార్యక్రమంలో నవీన్​ భార్య భవ్యతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.