చిత్రకోట్​, జోగ్​ జలపాతాల కనువిందు.. సుందర దృశ్యాలు!

By

Published : Jul 11, 2022, 7:55 PM IST

thumbnail

దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో జలపాతాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటిధారలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. కర్ణాటకలోని జోగ్​ జలపాత దృశ్యాలు పర్యటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నయాగరా జలపాతాలను పోలి ఉండే ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్​లో ఉన్న చిత్రకోట్​ జలపాతం కనువిందు చేస్తోంది. హోయలొలుకుతూ ఎర్రని రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో జలపాతం వద్ద ఫొటోలు దిగుతూ పర్యటకులు ఎంతగానో ఎంజాయ్​ చేస్తున్నారు. రుతువు రుతువుకు ఈ జలపాతం రంగులు మారడం విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.