'నేను బతికే ఉన్నా సారూ'.. పెన్షన్​ కోసం 102ఏళ్ల వృద్ధుడి బరాత్!

By

Published : Sep 9, 2022, 10:22 AM IST

thumbnail

'మీ రికార్డులు తప్పు.. నేను బతికే ఉన్నా.. దయచేసి పెన్షన్​ ఇవ్వండి' అంటూ వినూత్న నిరసన ప్రదర్శన చేశాడు 102 ఏళ్ల వృద్ధుడు. హరియాణా రోహ్​తక్​ జిల్లా గంద్రా గ్రామానికి చెందిన దులీ చంద్​కు మార్చి నుంచి వృద్ధాప్య పింఛను ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే.. అతడు చనిపోయాడని రికార్డుల్లో నమోదైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తనదైన శైలిలో తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆ పెద్దాయన. వరుడిలా ముస్తాబై, గుర్రపు బండి ఎక్కి.. మేళతాళాలు, యువకుల నృత్యాల మధ్య గురువారం రోహ్​తక్​లో బరాత్ నిర్వహించాడు. ఇప్పటికైనా తాను బతికే ఉన్నట్లు నమ్మి, పెన్షన్​ వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కోరాడు. మాజీ మంత్రి, భాజపా నేత మనీశ్​ గ్రోవర్​ను కలిసి ఇదే విషయంపై విజ్ఞాపన పత్రం అందజేశాడు దులీ చంద్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.