పోర్చుగల్ ప్రీమియర్ లీగ్లో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో జట్టు సారథి పెపె అదే జట్టులోని సహ ఆటగాడు మామడులోమ్ మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు ఒకరి మీద మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్లిందీ గొడవ. అంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి వారిని విడదీసి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ పోరులో ఫారెన్సె జట్టుపై పోర్టో 1-0తేడాతో గెలిచింది.