పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి : సీఈవో వికాస్ రాజ్
Telangana CEO Vikasraj Interview : ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో.. ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikasraj) తెలిపారు. ఇప్పటికే 14 లక్షల 40 వేల బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైందని వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అవసరమైన బ్యాలెట్ యూనిట్లను సమకూర్చుకున్నట్లు వివరించారు.
Telangana CEO on Telangana Assembly Elections 2023 : ఈ నెల 25వ తేదీలోపు హోమ్ ఓటింగ్, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న సీఈవో.. అందులో భాగంగా ప్రత్యేక పరిశీలకుల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లు సహా ఎన్నికల సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.