Gold seized in Shamshabad Airport : రూ.2 కోట్ల గోల్డ్​ స్మగ్లింగ్​.. ఎలా తరలిస్తున్నాడో తెలుసా?

By

Published : May 24, 2023, 11:15 AM IST

thumbnail

Customus Officers Seized Gold In Shamshabad Airport : శంషాబాద్​ విమానాశ్రయం అక్రమ బంగారం రవాణాకు అడ్డాగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తరచూ ఈ ఎయిర్​పోర్టులో అక్రమ బంగారం, డ్రగ్స్, విదేశీ కరెన్సీ పట్టుబడటమే దీనికి కారణం. అంతర్జాతీయ విమానాశ్రయం కావడం వల్ల ఇక్కడకు విదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ.. కానీ ఇండియాలో గోల్డ్​ రేటు ఆకాశాన్ని అంటుతోంది. అదే విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్​ దేశాల్లో తక్కువ మొత్తంలో లభ్యమవుతోంది. అందుకే కొంతమంది విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం రియాద్​ నుంచి వచ్చిన ఒక వ్యక్తి గోల్డ్​ స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడి 24 గంటలు కాలేదు.. అప్పుడే మరొక వ్యక్తి దుబాయ్​ నుంచి వస్తూ 2.19 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ కస్టమ్స్​ అధికారులకు దొరికిపోయాడు. 

దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు 2.19 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని​ విలువ సుమారు రూ.1.81 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుడు ఏపీలోని వైఎస్సాఆర్​ జిల్లా వాసిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకొని.. శంషాబాద్​ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఎమర్జెన్సీ లైట్​లో ఉంచి బంగారాన్ని తరలిస్తున్నట్లు ఎయిర్​పోర్ట్​ అధికారులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.