కల్యాణ మండపంలో 30 నిమిషాలు బుల్​ ఫైట్.. ఆఖరికి​

By

Published : Mar 13, 2023, 4:21 PM IST

thumbnail

గుజరాత్​.. అమ్రేలీ జిల్లా చలాలా గ్రామంలో రెండు ఎద్దులు హల్ చల్ సృష్టించాయి. ఏకంగా వివాహం జరిగే కల్యాణ మండపంలోకి వచ్చి పొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణతో మండపంలోని నూతన వధూవరులతో పాటు అతిథులందరూ కంగుతిన్నారు. సుమారు 30 నిమిషాలపాటు బసవన్నలు కొట్లాడుకున్నాయి. దీంతో అరగంట సేపు పెళ్లి క్రతువు ఆగిపోయింది. ఈ దృశ్యాలను పెళ్లికి వచ్చిన అతిథులు ఆసక్తిగా గమనించారు. అనంతరం వీటిని తమ మొబైల్​లో ఫొటోలు, వీడియోలు తీశారు. గొడవ సమయంలో ఎద్దులను విడిపించేందుకు కొందరు వాటిపై నీళ్లు పోశారు. కానీ, ఎవరూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కొద్దిసేపటికి ఎద్దులు శాంతించి పెళ్లి వేదిక నుంచి వెనుదిరగడం వల్ల తిరిగి పెళ్లి క్రతువు ప్రారంభమైంది. నవ దంపతులిద్దరూ ఒకట్టయ్యారు. ఇక బుల్ ఫైట్​కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.