నాలుగేళ్ల బాలుడిపైకి దూసుకెళ్లిన ఎద్దు.. తీవ్రగాయాలతో..

By

Published : Mar 9, 2023, 6:07 PM IST

Updated : Mar 9, 2023, 6:15 PM IST

thumbnail

నాలుగేళ్ల బాలుడిపై ఓ ఎద్దు దాడి చేసింది. ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాతతో కలిసి బయటకెళ్లిన బాలుడిపై ఎద్దు విచక్షణారహితంగా దాడి చేసింది. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారిపై ఎద్దు దాడి చేసిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. గురువారం ఉదయం జరిగిందీ ఘటన.

తానా గాంధీ పార్క్ ఏరియాలోని ధనిపూర్​లో నివాసం ఉండే ఓ వృద్ధుడు.. తన మనవడిని తీసుకుని పని మీద బయటకు వెళ్లాడు. మార్గమధ్యలో బాలుడిని రోడ్డుపై ఉంచి.. అలా పక్కకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఎద్దు బాలుడిపై దాడి చేసింది. బాలుడిని కిందపడేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడిపై ఎద్దు దాడిని గమనించిన వృద్ధుడు.. వెంటనే అక్కడికి వెళ్లి మనవడిని రక్షించాడు. అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం జేఎన్​ మెడికల్​ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఎద్దును బంధించి.. వేరే చోటుకు తరలించారు.

Last Updated : Mar 9, 2023, 6:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.