గ్రౌండ్​లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ క్రికెటర్లు!

By

Published : Sep 12, 2021, 12:57 PM IST

thumbnail

ఇటీవల భారత్​- ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో(Ind Eng Test) మైదానంలోకి వచ్చి.. జర్వో అనే వ్యక్తి పలుమార్లు మ్యాచ్​లకు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు.. గ్రౌండ్​లోకి సడెన్​ ఎంట్రీ ఇచ్చి.. క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టిందో బుజ్జి శునకం. ఈ ఘటన ఐర్లాండ్​లో జరిగింది. మహిళల దేశీయ టీ-20 టోర్నమెంట్​ మ్యాచ్​ జరుగుతుంటే.. మైదానంలోకి వచ్చిన శునకం బంతిని నోటపెట్టుకొని పరుగెత్తింది. దానికి పట్టుకోలేక ఫీల్డర్లు అవస్థలు పడ్డారు. అమెరికాలోనూ ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​ జరుగుతుండగా.. ఒక్కసారిగా ప్రత్యక్షమైన పిల్లి అందరి దృష్టిని ఆకర్షించింది. పైనుంచి పడబోయిన ఆ మార్జాలాన్ని గమనించిన అభిమానులు.. అమెరికా జెండా సాయంతో పట్టుకొని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.